Ap Pension Rules 2025: ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి ప్రతి నెలా ఈ రూల్ వర్తిస్తుంది

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి ప్రతి నెలా ఈ రూల్ వర్తిస్తుంది.. ఈ నెల కూడా! | Ap Pension Rules 2025

NTR Bharosa Pension Two Days: ఏపీ ప్రభుత్వం ఫిబ్రవరి 1న పింఛన్ డబ్బుల్ని విడుదల చేయనుంది. అయితే ఈ నెలలో పింఛన్‌కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి నెలలో రెండు రోజుల పాటు (ప్రతి నెలా 1, 2 తేదీల్లో) పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం రావడంతో ఫిబ్రవరి 3న పింఛన్‌ అందజేస్తారు.

ఇవి కూడా చూడండి

ఇవి కూడా చూడండి:

Ap Pension Rules 2025 హైలైట్:

  • ఏపీలో పింఛన్ పంపిణీపై కీలక నిర్ణయం
  • ఫిబ్రవరి 2 బదులు ఫిబ్రవరి 3న పంపిణీ
  • ఫిబ్రవరి 2 ఆదివారం కావడంతో నిర్ణయం

ఏపీలో వాళ్లకు రెండ్రోజులు పింఛన్

ఆంధ్రప్రదేశ్‌లో పింఛన్ అందుకునేవారికి ముఖ్యమైన గమనిక. ఫిబ్రవరి 2వ తేదీ ఆదివారం కావడంతో ఫిబ్రవరి నెల పింఛన్ పంపిణీ 1వ తేదీ, 3వ తేదీల్లో ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా పింఛను తీసుకుంటున్నవారు ఈ విషయాన్ని గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ పంపిణీకి సంబంధించి సెలవు దినాలు వస్తే కీలకమైన నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రభుత్వం ప్రతి నెలా 1వ తేదీనే పింఛన్ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒకవేళ ఎవరైనా ఒకటో తేదీన పింఛన్ తీసుకోకపోతే, మరుసటి రోజు (2వ తేదీ) పింఛన్ అందిస్తారు.

ఇవి కూడా చూడండి

ఇవి కూడా చూడండి:

ప్రతి నెలా 1,2 తేదీల్లో పింఛన్ పంపిణీ ఉంటుంది. అలాగే పింఛన్ పంపిణీ చేసే ఒకటో తేదీ సెలవు/ఆదివారం కనుక వస్తే, గత నెల చివరి పని దినం రోజు పింఛన్ డబ్బుల్ని ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. ఒకవేళ నెలలో 2వ తేదీ సాధారణ సెలవు/ఆదివారం అయితే, ఆ తర్వాత పని దినం రోజు పింఛన్ డబ్బుల్ని అందజేస్తారు. ఉదాహరణకు జనవరి 1 సెలవు దినం కావడంతో ప్రభుత్వం డిసెంబర్ 31న పింఛన్ డబ్బుల్ని పంపిణీ చేసింది. అలాగే జనవరి 1న న్యూ ఇయర్ కావడంతో, ఆ రోజు పింఛన్ పంపిణీ కుదరకపోవడంతో జనవరి 2న పింఛన్ పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అంటే డిసెంబర్ 31న, జనవరి 2 తేదీల్లో పింఛన్ పంపిణీ చేశారు (డిసెంబర్ 31న పింఛన్ డబ్బులు తీసుకోలేనివారికి).

ఈ నెలలో కూడా ఫిబ్రవరి 2 ఆదివారం కావడంతో ఫిబ్రవరి 1న పింఛన్ తీసుకోలేని వారికి ఫిబ్రవరి మూడో తేదీన డబ్బులు అందజేస్తారు.

పింఛన్ల తనిఖీలు:

మరోవైపు ఏపీ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా పింఛన్ల తనిఖీలను చేపట్టిన సంగతి తెలిసిందే. మెడికల్ కేటగిరీ, దివ్యాంగుల కేటగిరీలో పింఛన్‌లను అందుకుంటున్నవారిలో అనర్హులను గుర్తించే పనిలో ఉంది. ఈ మేరకు ప్రత్యేక టీమ్‌లు రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలు చేపట్టాయి. ముందుగా మెడికల్ కేటగిరీలో తనిఖీలు చేపట్టారు, అవి ముగియగానే దివ్యాంగుల కేటగిరీలో పింఛన్‌లు అందుకుంటున్నవారిలో అనర్హులను గుర్తించనున్నారు.

గత ప్రభుత్వ హయాంలో భారీగా అనర్హులకు పింఛన్‌లు పంపిణీ చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో అధికారులు తనిఖీలు మొదలు పెట్టారు. అలాగే కొత్త పింఛన్‌లకు దరఖాస్తుల్ని త్వరలోనే స్వీకరించనున్నారు. ఓ వైపు అనర్హులను తొలగించే ప్రక్రియను కొనసాగిస్తూనే, అర్హత ఉండి పింఛన్ తీసుకోలేకపోతున్నవారికి న్యాయం చేస్తామని చెబుతోంది ప్రభుత్వం. రాష్ట్రంలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందిస్తామని చెబుతోంది.

 

Ap Pension Rules 2025 Book APSRTC Ticket In AP Whatsapp 2025: వాట్సాప్‌ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?

Ap Pension Rules 2025 ShareChat Recruitment 2025: ShareChat కంపెనీ లో ఇంటి నుండి పనిచేసే ఉద్యోగాలు

Ap Pension Rules 2025 Ration Cards 2025: ఫిబ్రవరి 15 నుంచి వారి రేషన్ కార్డులు రద్దు..కేంద్రం కొత్త మార్గదర్శకాలు

ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని పొందడానికి మా వాట్సాప్ ఛానెల్‌లో మరియు టెలిగ్రామ్ ఛానెల్‌లో చేరండి

Telegram Channel Join Now
WhatsApp Channel Join Now

 

Book APSRTC Ticket In AP Whatsapp 2025: వాట్సాప్‌ నుంచి ఆర్టీసీ బస్‌టికెట్ ఎలా బుక్ చేయాలి?

Ap Registration Charges 2025: ఏపీలో నేటి నుంచి పెరగనున్న భూముల రిజిస్ట్రేషన్ ఛార్జీలు

 

4 thoughts on “Ap Pension Rules 2025: ఏపీలో పింఛన్లు తీసుకునే వారికి ప్రతి నెలా ఈ రూల్ వర్తిస్తుంది”

Leave a Comment

WhatsApp